శ్రీ సాయి వృద్ధ ఆశ్రమం మదనపల్లి కలకడ గ్రామంలో ఉన్న పూర్ పీపుల్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ గానుగపెంట శ్రీహరి రెడ్డి గారు అక్కడికి వెళ్లి వృద్ధుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాల కోసం భోజన ఖర్చుల నిమిత్తం మరియు ఆరోగ్య అవసరాల కోసం రూ.10,000 రూపాయలను అందజేశారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా వృద్ధులకు ఎంతో ఆనందం కలిగింది.